వాషింగ్టన్: ప్రపంచ ప్రసిద్ధ వార్తా పత్రిక వాషింగ్టన్ పోస్ట్ 300 మందికి పైగా జర్నలిస్టులు, ఇతర సిబ్బందిని ఉద్యోగం నుంచి తొలగించింది. ఎడిటోరియల్ విభాగంలో భారీ సంఖ్యలో విదేశీ రిపోర్టర్లు, స్థానిక రిపోర్టింగ్ బృందాలు, క్రీడా పాత్రికేయులను, వాణిజ్య విభాగ ఉద్యోగులను తొలగించింది.
ఉద్వాసనకు గురైన వారిలో భారత ఎంపీ శశిథరూర్ కుమారుడు ఇషాన్ థరూర్ కూడా ఉన్నారు. వాషింగ్టన్ పోస్ట్లో ఆయన సీనియర్ ఇంటర్నేషనల్ అఫైర్స్ కాలమిస్ట్గా పనిచేసేవారు.