వాషింగ్టన్, నవంబర్ 15: కరోనా వైరస్ మనలో ఎంత భయాన్ని కలిగించిందో అందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు మానవాళిని తుడిచి పెట్టేసే అవకాశమున్న ‘ఫ్యాక్టర్ ఎక్స్’ ప్రాణాంతక వైరస్ పునరుద్ధరణ జరగొచ్చని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ధ్రువ ప్రాంతాల్లో మంచు పలకల కింద వేలాది ఏండ్ల క్రితం నిక్షిప్తమైన వైరస్లు ఇప్పుడు భూతాపం కారణంగా బయటకు రావచ్చని వారు అంచనా వేస్తున్నారు.