సిడ్నీ: ఆస్ట్రేలియా-జర్మన్ వారసురాలు తన దాతృత్వాన్ని చాటుకున్నారు. తన అమ్మమ్మ నుంచి వారసత్వంగా సంక్రమించిన 24.7 మిలియన్ డాలర్ల (సుమారు రూ.200 కోట్లు) సంపదను పేదలకు పంచాలని నిర్ణయించుకున్నారు.
సమాజంలోని అన్ని వర్గాల వారికి సమానంగా సంపదను పంచడంలో ప్రభుత్వం విఫలమైనందున తానీ నిర్ణయం తీసుకున్నట్టు 31 ఏండ్ల మార్లెనె ఏంగెల్హార్న్ ప్రకటించారు.