జెనీవా: కరోనాలాంటి ప్రమాదకర వైరస్లు, బ్యాక్టీరియాలు, ఫంగస్లు మరిన్ని వచ్చే ప్రమాదం ఉన్నదని ఐక్యరాజ్యసమితి పర్యావరణ ప్రోగ్రాం (యూఎన్ఈపీ) హెచ్చరించింది. 2050 నాటికి సూపర్ బగ్లు పుట్టి మానవాళిని అతలాకుతలం చేస్తాయని, కోట్లలో మరణాలు సంభవిస్తాయని తేల్చిచెప్పింది.
కాలుష్యం, పారిశుద్ధ్య లేమి, ఫార్మా కంపెనీల వల్ల కలుషితమైన నీటితో సూపర్ బగ్లు పుట్టుకొస్తాయని, అవి క్యాన్సర్లా మనిషిని తినేస్తాయని చెప్పింది. ఈ ప్రమాదం నుంచి రక్షించుకోవాలంటే వెంటనే ఆరోగ్య వ్యవస్థలో పెను మార్పులు రావాల్సి ఉన్నదని తెలిపింది.