అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా రోజు రోజుకి విజృంభిస్తూనే ఉంది. గత 24 గంటల్లో ఏపీలో కొత్తగా 22,610 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా కొవిడ్-19తో 114 మంది చనిపోయారు. వ్యాధి నుండి 23,098 మంది కోలుకుని డిశ్చార్జీ అయ్యారు. తాజా కేసులతో కలుపుకుని ఏపీలో కరోనా కేసుల సంఖ్య 15,21,142కి చేరింది. వీటిలో యాక్టివ్ కేసుల సంఖ్య 2,09,134గా ఉంది. కొవిడ్తో ఇప్పటివరకు మొత్తం 9,800 మృత్యువాతపడ్డారు.
జిల్లాల వారీగా కొవిడ్తో మరణించిన వారి వివరాలిలా ఉన్నాయి. పశ్చిమ గోదావరిలో 17 మంది, చిత్తూరులో 15, తూర్పు గోదావరి, గుంటూరు, విశాఖపట్నంలో 10 మంది చొప్పున, అనంతపురం, విజయనగరంలో తొమ్మిదిమంది చొప్పున, కృష్ణలో ఎనిమిది మంది, కర్నూలు, ప్రకాశంలో ఏడుగురు చొప్పున, నెల్లూరు, శ్రీకాకుళంలో ఐదుగురు చొప్పున, వైఎస్ఆర్ కడపలో ఇద్దరు మరణించారు.