హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా శివారు ప్రాంతాలైన అబ్దుల్లాపూర్మెట్, హయత్ నగర్లలో అర్ధరాత్రి దొంగలు హల్చల్ చేశారు. హయత్నగర్ పరిధిలోని సూర్యవంశీ కాలనీలో రెండిళ్లలో చోరీ చేసి 10 తులాల బంగారం, కిలో వెండి అపహరించారు. మరో ఇంట్లో చోరీకి యత్నించినా సాధ్యం కాకపోవడంతో పరారయ్యారు. అదేవిధంగా అబ్దుల్లాపూర్మెట్లోనూ 3 దుకాణాల్లో దుండగులు చోరీకి యత్నించారు. దుకాణాల షట్టర్లను ధ్వంసం చేసి దొంగతనానికి విఫలయత్నం చేశారు. చోరీ దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. రెండుచోట్ల చోరీలకు పాల్పడింది ఒకే ముఠానా లేక వేర్వేరా.? అన్నది తెలుసుకునేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. దుండగుల ఆనవాళ్లు గుర్తించేందుకు సమీపంలోని సీసీ కెమెరాల దృశ్యాలను పరిశీలిస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.