ఇస్లామాబాద్, డిసెంబర్ 25: పాకిస్థాన్ నేషనల్ అసెంబ్లీ, ప్రొవిన్షియల్ అసెంబ్లీలకు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే ఎన్నికల్లో పాకిస్థాన్ మర్కజి ముస్లిం లీగ్ (పీఎంఎంఎల్) పోటీ చేస్తున్నది. 2008 నవంబరు 26న ముంబై లో జరిగిన ఉగ్రవాద దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్ ఈ పార్టీకి మద్దతిస్తున్నాడు. హఫీజ్ను ఐక్యరాజ్య సమితి ఉగ్రవాదిగా ప్రకటించింది. అమెరికా అతని తలకు 10 మిలియన్ డాలర్లు వెల కట్టింది. భారత్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ హఫీజ్. వచ్చే ఫిబ్రవరి 8న జరిగే ఈ ఎన్నికల్లో దాదాపు అన్ని స్థానాలకు పీఎంఎంఎల్ పోటీ చేస్తున్నది. హఫీజ్ సయీద్ కొడుకు తల్హా సయీద్ లాహోర్ నేషనల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్లు తెలుస్తున్నది.