న్యూఢిల్లీ: అమెరికా హౌజ్ స్పీకర్ నాన్సీ పెలోసీ తైవాన్లో పర్యటించిన విషయం తెలిసిందే. అయితే తైవాన్కు పెలోసీ వచ్చిన నేపథ్యంలో చైనాలోని బోర్డర్ పట్టణాల్లో యుద్ధ ట్యాంక్లను మోహరించారు. ట్యాంక్లతో పాటు ఇతర మిలిటరీ ఎక్విప్మెంట్ను తరలించారు. తైవాన్ తమకు చెందిన భూభాగం అని చైనా చెబుతున్న విషయం తెలిసిందే. మరో వైపు తైవాన్ స్వతంత్య్ర దేశమని, దానికి అమెరికా అండగా నిలుస్తోంది. చైనాకు చెందిన సోషల్ మీడియా యిన్ సురాలో యుద్ధ ట్యాంక్ల వీడియోలను పోస్టు చేశారు. రద్దీగా ఉండే రోడ్లపై ఆ వాహనాలు కదిలాయి. కొన్ని ట్రక్కులపై ట్యాంక్లను తీసుకెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. ఒకవేళ పెలోసీ కనుక తైవాన్ విజిట్ చేస్తే అప్పుడు తీవ్ర పరిణామాలు తప్పవని చైనా హెచ్చరించిన విషయం తెలిసిందే. మరో వైపు చైనాకు వార్నింగ్ ఇచ్చిన అమెరికా.. ఈస్ట్ ఐలాండ్లో నాలుగు యుద్ధనౌకలను మోహరించింది.
— Yin Sura 尹苏拉 (@yin_sura) August 2, 2022
In Fujian right now😯😯 pic.twitter.com/hHxfPTDQEo
— Yin Sura 尹苏拉 (@yin_sura) August 2, 2022