కాబూల్ : ఆప్ఘనిస్ధాన్ నుంచి అమెరికా దళాల ఉపసంహరణ పూర్తయి తాలిబన్లు పాలనా పగ్గాలు చేపట్టిన తర్వాత పాలక ఉగ్రవాద గ్రూపు వ్యభిచారంలో నిమగ్నమైన మహిళలను చంపేందుకు వారి జాబితా రూపొందిస్తోందని సమాచారం. వ్యభిచారిణులకు తాలిబన్లు మరణ దండన విధిస్తారనే ప్రచారం సాగుతోంది.
చీకటి వృత్తిలో ఉన్న మహిళలను గుర్తించేందుకు తాలిబన్ డెత్ స్క్వాడ్స్ కొన్ని అశ్లీల సైట్స్ను జల్లెడ పడుతున్నాయని చెబుతున్నారు. 1996-2001లో గత తాలిబన్ హయాంలోనూ ఇలాంటి మహిళలకు బహిరంగ మరణ దండన అమలు చేశారు.
ఆప్ఘన్ వ్యభిచారిణులను గుర్తించి వారిని చంపడం లేదా వారిని తమ లైంగిక అవసరాల కోసం బానిసలుగా మార్చేందుకు తాలిబన్ ఫైటర్లు అశ్లీల సైట్స్ను వాకబు చేస్తున్నారు. గత 20 ఏండ్లుగా తాలిబన్లు అక్రమ సంబంధాలు, వివాహేతర బంధాలు నెరిపే మహిళలను కడతేరుస్తూ వచ్చారు.