Talibans for own Airforce | ఆఫ్ఘనిస్థాన్పై పట్టు సాధించి పాలనాపగ్గాలు చేబూనిన తాలిబన్లు.. సొంతంగా వైమానికదళం ఏర్పాటు చేసుకోవడంపై దృష్టి కేంద్రీకరించారు. మంగళవారం కాబూల్లోని ప్రధాన మిలిటరీ దవాఖాన.. సర్దార్ దావూద్ఖాన్ దవాఖానపై ఐసీస్ ఉగ్రవాదులు జరిపినట్లు భావిస్తున్న దాడిలో 23 మంది మృతి చెందారు. ఈ ఘటన తర్వాత తాలిబన్ పైలట్లతో కూడిన అమెరికా బ్లాక్ హాక్తోపాటు మూడు హెలికాప్టర్లు దవాఖాన పైకప్పుపై మోహరించాయి. వీటిలోని క్విక్ రియాక్షన్ టీం ఉగ్రవాదులపై ఎదురుకాల్పులకు దిగింది.
దవాఖానపై ఐసిస్ దాడి తర్వాత సొంతంగా వైమానిక దళాన్ని ఏర్పాటు చేసుకోవాలని భావిస్తున్నామని ఆఫ్ఘన్ ఇంటిరియర్ మంత్రి ఖరీ సయీద్ఖోస్తీ తెలిపారు. గత ప్రభుత్వంలో పని చేసిన వైమానిక దళ నిపుణుల సాయం తీసుకోవాలనుకుంటున్నట్లు చెప్పారు. వారిని తిరిగి తీసుకొచ్చేందుకు తమ వద్ద ప్రణాళిక ఉందని ఖరీ సయీద్ఖాన్ ఖోస్తీ పేర్ఒన్నారు. అందుకు అవసరమైన