Bomb Blast | ఆఫ్ఘనిస్థాన్లోని మజార్-ఎ-షరీఫ్లో గురువారం బాంబు దాడి జరిగింది. ఈ ఘటనలో తాలిబన్లు నియమించిన ప్రావిన్షియల్ గవర్నర్ సహా మరో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. బాల్ఖ్ ప్రావిన్స్ రాజధాని మజార్-ఇ షరీఫ్లోని గవర్నర్ కార్యాలయం లోపల పేలుడు చోటు చేసుకున్నది. దౌద్ ముజ్మల్, మరో ఇద్దరు మరణించారని తాలిబాన్ స్థానిక పోలీసు చీఫ్ ప్రతినిధి మహ్మద్ ఆసిఫ్ వజీరి తెలిపారు. దాడికి తామే బాధ్యులమని ఎవరూ ఇప్పటి వరకు ప్రకటించలేదు. కానీ, ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ ప్రాంతీయ అనుబంధ సంస్థ – ఖొరాసన్ పనిగా భావిస్తున్నారు. ఇది తాలిబన్ల వ్యతిరేక సంస్థ. ఆగస్ట్ 2021లో తాలిబాన్ దేశాన్ని స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి మిలిటెంట్ గ్రూప్ ఆఫ్ఘనిస్తాన్లో భారీగా దాడులు చేస్తున్నది. తాలిబాన్ పెట్రోలింగ్, ఆఫ్ఘనిస్తాన్ షియా మైనారిటీ సభ్యులను లక్ష్యంగా చేసుకొని దాడులకు తెగబడుతున్నది.