ISIS | ఐసీస్ చీఫ్( ISIS Chief ) అబు హుస్సేన్ అల్ ఖురేషీని మట్టుబెట్టినట్లు టర్కీ ప్రెసిడెంట్ టయిప్ ఎర్డోగన్ ప్రకటించారు. టర్కీ ఎంఐటీ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ నిర్వహించిన ఆపరేషన్లో అబు హుస్సేన్ అల్ ఖురేషీ మృతి చెందినట్లు తెలిపారు. ఈ ఆపరేషన్ శనివారం జరిగినట్లు నిర్ధారించారు.
ఐసీస్ చీఫ్ అబు హసన్ అల్ హస్మినీ ఆల్ ఖురేషిని గతేడాది నవంబర్ 30వ తేదీన బలగాలు మట్టుబెట్టిన సంగతి తెలిసిందే. హస్మినీ అల్ ఖురేషి స్థానంలో అబుల్ హుస్సేన్ అల్ ఖురేషీని నియమించారు. అయితే అల్ ఖురేషీ ఉంటున్న జిన్డైర్స్ జోన్ను టర్కీష్ ఇంటెలిజెన్స్ ఏజెంట్స్, లోకల్ మిలటరీ పోలీసులు దిగ్భందించారు. ఆ తర్వాత ఖురేషీని అంతమొందించి, ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నారు.