వాషింగ్టన్, ఆగస్టు 4: భూమిని పోలినటువంటి మరే ఇతర గ్రహాలైనా విశ్వంలో ఉన్నాయా? అనే వివరాలు తెలుసుకోవడానికి ఇప్పటికే ప్రయత్నాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో భూమికి 37 కాంతి సంవత్సరాల దూరంలో రాస్ 508బీ అనే ఓ గ్రహాన్ని (సూపర్ ఎర్త్) పరిశోధకులు తాజాగా గుర్తించారు. సూర్యుడికి భూమి మధ్య దూరం కంటే కేవలం 0.05 రెట్లు ఎక్కువ దూరంలోనే ఈ గ్రహం తన నక్షత్రంతో ఎడంగా ఉన్నదని పరిశోధకులు తెలిపారు. దీంతో ఆ గ్రహంపై నీరు ఉండే అవకాశం లేకపోలేదంటున్నారు. జీవం ఉండటానికి కూడా పరిస్థితులు దోహదపడొచ్చని అభిప్రాయపడుతున్నారు. భూమి కంటే నాలుగు రెట్లు ఎక్కువ బరువుతో ఉన్న ఈ గ్రహం అక్కడి నక్షత్రం చుట్టూ ఒకసారి పరిభ్రమణం చేయడానికి 10.8 రోజులు పడుతుందట.