లాస్ ఏంజిల్స్: గూగుల్ సంస్థ సుమారు 12 వేల మందిని ఉద్యోగాల నుంచి తొలగించిన విషయం తెలిసిందే. దానిపై సోమవారం ఆ సంస్థ సీఈవో సుందర్ పిచాయ్ మాట్లాడారు. కంపెనీ ప్రగతి మందగించిందని, అందుకే సరైన సమయంలో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఆయన అన్నారు. కంపెనీ అంతర్గత సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కంపెనీ వ్యవస్థాపకులు, బోర్డు సభ్యులతో చర్చించిన తర్వాత ఆరు శాతం ఉద్యోగుల తొలగింపుకు నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. చాలా స్పష్టంగా, చాలా నిర్ణయాత్మకంగా, చాలా తొందరగా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని, నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యం జరిగితే అప్పుడు సమస్య మరింత జఠిలం అయ్యే అవకాశాలు ఉన్నట్లు సుందర్ పిచాయ్ తెలిపారు.