ఇస్లామాబాద్: పాకిస్థాన్లో ఆత్మాహుతి బాంబు దాడి జరిగింది. ఈ సంఘటనలో ఒక పోలీస్ మరణించగా, నలుగురు పోలీసులు సహా ఆరుగురు గాయపడ్డారు. పాక్ రాజధాని ఇస్లామాబాద్లో శుక్రవారం ఉదయం ఈ సంఘటన జరిగింది. ఐ-10/4 సెక్టార్లో దంపతులు ప్రయాణిస్తున్న క్యాబ్పై పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. తనిఖీ కోసం ఆ కారును ఆపారు. దీంతో ఆ జంట వాహనం నుంచి కిందకు దిగింది. అనంతరం ఒక వ్యక్తి మళ్లీ కారు లోపలకు వెళ్లి తనను తాను పేల్చుకున్నాడు. ఈ పేలుడులో ఈగిల్ స్క్వాడ్కు చెందిన ఒక పోలీస్ అధికారి చనిపోయాడు. మరో నలుగురు పోలీసులు, ఇద్దరు పౌరులు గాయపడ్డారు.
కాగా, సూసైడ్ బాంబ్ బ్లాస్ట్ గురించి తెలిసిన వెంటనే పాకిస్థాన్కు చెందిన ప్రత్యేక ఉగ్రవాద నిరోధక దళాలు ఆ ప్రాంతానికి చేరుకున్నాయి. ఈ సంఘటన నేపథ్యంలో ఆ మార్గంలో వెళ్లే వాహనాలను మరో మార్గం వైపు మళ్లించారు. మరోవైపు ఆత్మాహుతి బాంబు పేలుడుపై ఇప్పటి వరకు ఏ ఉగ్రవాద సంస్థ స్పందించలేదు. అయితే ఈ ఏడాది జూన్లో ప్రభుత్వంతో కుదిరిన నిరవధిక కాల్పుల విరమణను నిషేధిత తెహ్రీక్ ఇ తాలిబాన్ పాకిస్థాన్ (టీటీపీ) రద్దు చేసింది. ఈ నేపథ్యంలో ఆ సంస్థపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Breaking News: Blast in a suspected cab in #Islamabad’s I-10/4 Sector, leaves 4 policemen hurt. Police was chasing the suspected cab and the blast occurred when was stopped for checking. 3 suspects were reportedly inside the cab. #IslamabadBlast pic.twitter.com/40reDxCVoT
— Islamabad Updates (@IslamabadViews) December 23, 2022