ఉక్రెయిన్ నుంచి భారతీయులను తీసుకొచ్చిన మూడో విమానం కూడా క్షేమంగా ఢిల్లీకి చేరుకుంది. ఇందులో 240 మంది భారతీయ విద్యార్థులు ఉన్నారు. బుడాపెస్ట్ నుంచి బయల్దేరిన ఈ విమానం ఆదివారం ఉదయానికి ఢిల్లీ ఎయిర్ పోర్ట్కు చేరుకుంది. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఈ విద్యార్థులందరికీ స్వాగతం పలికారు. స్వదేశానికి చేరుకోవడంతో విద్యార్థులు, కుటుంబీకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఉక్రెయిన్ నుంచి భారతీయులను తీసుకొచ్చిన రెండో విమానం కూడా శనివారం రాత్రి ఢిల్లీకి చేరుకుంది. రొమేనియా రాజధాని బుకారెస్ట్ నుంచి 250 మందితో ఉన్న ఈ విమానం ఢిల్లీకి క్షేమంగా చేరుకుంది. కేంద్ర విమానయాన మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఈ విద్యార్థులకు స్వాగతం పలికారు. ఇప్పటి వరకూ మొత్తం 709 మంది ఉక్రెయిన్ నుంచి భారతీయ విద్యార్థులు క్షేమంగా స్వదేశానికి తిరిగొచ్చారు. వీర