‘డేనియల్’ తుఫాన్ తాకిడికి ఆఫ్రికా దేశం లిబియా అతలాకుతలమైంది. ఆదివారం రాత్రి నుంచి మొదలైన భారీ వర్షం, వరదల కారణంగా తూర్పు లిబియాలో జల ప్రళయం సంభవించింది. ఒక్క డెర్నా పట్టణంలోనే దాదాపు 2వేల మంది పౌరులు చనిపోయారని, 10వేల మంది ఆచూకి గల్లంతైందని సమాచారం. ముఖ్యంగా డెర్నాలో పరిస్థితి అత్యంత దయనీయంగా మారిందని ప్రభుత్వ అధికారులు తెలిపారు.
డేనియల్ తుఫాన్ ఆదివారం రాత్రి లిబియా తీర ప్రాంతాన్ని తాకింది. కొన్ని గంటల వ్యవధిలోనే తుఫాన్ తీవ్ర రూపం దాల్చింది. వరదల తాకిడికి రెండు డ్యాములు కొట్టుకుపోయాయంటే జల విలయం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. డ్యాములు ధ్వంసం కాగా అక్కడ్నుంచి పోటెత్తిన వరద నీటిలో అనేకమంది మధ్యధరా సముద్రంలోకి కొట్టుకుపోయారని అంతర్జాతీయ మీడియాలో వార్తలు వెలువడ్డాయి.