మాస్కో: పోరాటం ఆపి లొంగిపోయే వరకు, తమ డిమాండ్లు నెరవేరే వరకు యుద్ధం కొనసాగుతుందని ఉక్రెయిన్ను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ హెచ్చరించారు. ఈ నేపథ్యంలో మూడవ రౌండ్ శాంతి చర్చల్లో ‘నిర్మాణాత్మక’ విధానాన్ని అవలంభించడం మంచిదని ఉక్రెయిన్కు సూచించారు. టర్కీ ప్రధాని తయ్యిప్ ఎర్డోగాన్తో ఆదివారం ఫోన్లో మాట్లాడిన పుతిన్ ఈ మేరకు వ్యాఖ్యానించారు. ఒక పథకం, షెడ్యూల్ ప్రకారం ఉక్రెయిన్పై రష్యా ప్రత్యేక ఆపరేషన్ కొనసాగుతున్నదని తెలిపారు. అనుకున్నట్లుగానే తమ లక్ష్యాలను చేరుకుంటున్నామని చెప్పారు.
కాగా, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఆదివారం సుమారు గంటా 45 నిమిషాలపాటు రష్యా అధ్యక్షుడితో ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్ తీరుపై పుతిన్ మండిపడ్డారు. రష్యా దళాలు చుట్టుముట్టిన పోర్టు నగరమైన మరియుపోల్లో కాల్పులు విరమించినప్పటికీ పౌరులను తరలించడంలో ఉక్రెయిన్ విఫలమైందని విమర్శించారు. విదేశీలను బంధీలుగా చేసుకునేందుకు ఉద్దేశ పూర్వకంగానే ఉక్రెయిన్ ఇలా వ్యవహరించిందని పుతిన్ ఆరోపించారు.