వాషింగ్టన్: స్టార్బక్స్ కాఫీ కంపెనీ సీఈవోగా భారత సంతతి వ్యక్తి లక్ష్మణ్ నరసింహన్ను నియమిస్తున్నట్లు ప్రకటించారు. అక్టోబర్ ఒకటో తేదీ నుంచి ఆయన ఆ విధుల్లో చేరనున్నారు. అయితే 2023 ఏప్రిల్ వరకు హోవార్డ్ స్కల్జ్ ఆ కంపెనీ తాత్కాలిక చీఫ్గా కొనసాగుతారు. 55 ఏళ్ల లక్ష్మణ్ గతంలో లైసాల్ అండ్ ఎన్ఫామిల్ బేబీ ఫార్ములా కంపెనీలో సీఈవోగా చేశారు. తమ కంపెనీకి రాబోయే సీఈవో ఓ అసాధారణ వ్యక్తి అని భావిస్తున్నట్లు స్టార్బక్స్ తెలిపింది. అతను ట్యాలెంట్ ఉన్న లీడర్ అని స్టార్బక్స్ బోర్డు చైర్ వుమెన్ మెల్లోడీ హాబ్సన్ తెలిపారు. ప్రస్తుతం లండన్లో ఉన్న లక్ష్మణ్.. స్టార్బక్స్ కోసం సియాటిల్ వెళ్లనున్నారు.