కొలంబో, ఆగస్టు 13: భారత్ ఎన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసినా శ్రీలంక మాత్రం చైనా నౌకకు అనుమతిచ్చింది. తమ మిలిటరీ వ్యవస్థలపై చైనా నౌక యువాన్ వాంగ్ 5 కన్నేస్తుందని భారత్ ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అయినా కూడా హంబన్తోట పోర్టులో నౌకను నిలిపేందుకు శ్రీలంక శనివారం అనుమతులు జారీ చేసింది. యువాన్ వాంగ్ 5.. రిసెర్చ్, సర్వే నౌక అని చెబుతున్నప్పటికీ గూఢచార నౌక అని భారత్ పేర్కొంటున్నది. తొలుత ఆగస్టు 11న శ్రీలంకకు రావాల్సి ఉండగా భారత్ అభ్యంతరాల నేపథ్యంలో కొన్ని రోజులు వాయిదా పడింది.