టెక్సాస్: బిలియనీర్ ఎలన్ మస్క్కు చెందిన స్పేస్ఎక్స్ కంపెనీ .. మూడవ జనరేషన్కు చెందిన స్టార్సిప్(Starship) వీ3ను విజయవంతంగా పరీక్షించింది. చరిత్రలోనే అతి పెద్ద, శక్తివంతమైన రాకెట్ను టెస్ట్ చేశారు. శుక్రవారం సుమరు గంటకు పైగా ఆ పరీక్ష నిర్వహించారు. ఆ తర్వాత స్టార్షిప్ రాకెట్.. హిందూ మహాసముద్రంలో దిగింది. అయితే ప్లాన్ ప్రకారమే ఆ స్టార్షిప్ను సముద్రంలో పేల్చారు. ఈ పరీక్ష ద్వారా చాలా వరకు టెస్ట్ ఫ్లయిట్ లక్ష్యాలను అందుకున్నట్లు స్పేస్ఎక్స్ కంపెనీ తెలిపింది. రాకెట్ ఇంజిన్లో కొన్ని సమస్యలు వచ్చినట్లు గుర్తించారు. రాకెట్ బూస్టర్ను రికవరీ చేయలేదన్నారు.
సముద్రంపై తమ రాకెట్ దిగినట్లు ఎక్స్ అకౌంట్లో ఆ కంపెనీ ప్రకటించింది. టెస్ట్ ఫ్లయిట్లో భాగంగా సుమారు 22 మాక్ శాటిలైట్లను కూడా స్టార్షిప్ రిలీజ్ చేసింది. రాకెట్కు చెందిన హీట్షీట్ను విశ్లేషించేందుకు ప్రత్యేకంగా ఓ శాటిలైట్ ను కూడా రిలీజ్ చేశారు. నింగిలోకి రాకెట్ ఎగిరినా.. అనుకున్న కక్ష్యలో అది వెళ్లలేదని పేర్కొన్నారు. మంటలు అంటుకునే సమయంలో ఓ ఇంజిన్ విఫలమైనట్లు తెలిసింది. రాకెట్కు చెందిన సూపర్ హెవీ బూస్టర్ అనుకున్నట్లు పర్ఫార్మ్ చేయలేదన్నారు. ఆ బూస్టర్ గల్ఫ్ ఆఫ్ మెక్సికోలో పడినట్లు చెబుతున్నారు.
మస్క్ తన ఎక్స్లో ఈ ప్రయోగంపై ప్రశంసలు కురిపించారు. అదో ఎపిక్ ఫ్లయిట్ అన్నారు. మానవాళికి సంబంధించిన లక్ష్యాన్ని అందుకున్నట్లు తెలిపారు.
Splashdown confirmed! Congratulations to the entire SpaceX team on the twelfth flight test of Starship! pic.twitter.com/XXBAtryPpL
— SpaceX (@SpaceX) May 22, 2026