దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు ఎఫ్డబ్ల్యూ డీ క్లెర్క్ కన్నుమూశారు. ఆయన వయసు 85 ఏళ్లు. దక్షిణాఫ్రికాను ఏలిన చివరి శ్వేతజాతీయుడు ఈయనే. దేశ ప్రజాస్వామ్య మార్పులో ఆయన కీలక పాత్ర పోషించారు. ఏడాది కాలం నుంచి డీ క్లెర్క్ క్యాన్సర్తో బాధపడుతున్నారు. సెప్టెంబర్ 1989 నుంచి మే 1994 వరకు ఆయన దేశాధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించారు. జైలులో ఉన్న నల్లజాతీ సూరీడు నెల్సన్ మండేలాను విడుదల చేస్తున్నట్లు 1990లో ఈయనే ప్రకటించారు. ఆ తర్వాత 1994లో కొత్త దేశాధ్యక్ష ఎన్నికలు నిర్వహించారు. డీ క్లెర్క్ మరణవార్తను ఆయనకు చెందిన ఫౌండేషన్ ఇవాళ ప్రకటించింది. కేప్టౌన్లో ఉన్న ఫ్రెష్నేయి నివాసంలో క్లెర్క్ తుదిశ్వాస విడిచినట్లు పేర్కొన్నది. క్లెర్క్ తీసుకువచ్చిన రాజీకయ సంస్కరణల ద్వారానే మండేలాకు చెందిన ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ 1994 ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. 1993లో ప్రకటించిన నోబెల్ శాంతి బహుమతిని మండేలాతో పాటు క్లెర్క్ కూడా షేర్ చేసుకున్నారు.