ఉక్రెయిన్పై రష్యా నానాటికీ దాడులను తీవ్రతరం చేస్తోంది. ముఖ్య నగరాలు, కార్యాలయాలు, పౌరుల ఆవాసాలపై కూడా దాడులకు తెగబడుతోంది. దీంతో కొన్ని లక్షల మంది నిరాశ్రయులవుతున్నారు. ఉక్రెయిన్ నుంచి ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిపోతున్నారు. ఇలా యుద్ధం కారణంగా ఉక్రెయిన్ను విడిచిపెట్టి, ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారి సంఖ్య 32.50 లక్షలు. ఇందులో 20 లక్షల మంది పోలాండ్ బార్డర్ దాటి వెళ్లిపోయారు. ఈ విషయాన్ని ఐక్యరాజ్య సమితికి చెందిన రెఫ్యూజీస్ ఎజెన్సీ ప్రకటించింది. ఉక్రెయిన్ రష్యా యుద్ధం ప్రకటించింది మొదలు ఇప్పటి వరకూ 32.50 లక్షల మంది దేశాన్ని విడిచిపెట్టారని పేర్కొంది.
ఈ విషయంపై ఐక్యరాజ్యసమితి రెఫ్యూజీస్ ఏజెన్సీ ప్రతినిధి మైథ్యూ సాల్ట్మార్ష్ మాట్లాడుతూ.. యుద్ధ మేఘాలు మరింత కమ్ముకుంటున్నా కొద్దీ ఈ సంఖ్య కూడా పెరిగే ఛాన్స్ ఉందని ఆయన హెచ్చరించారు. దేశం విడిచి వెళ్లిన వారిలో 90 శాతం మహిళలు, పిల్లలే ఉన్నారని ఆయన వెల్లడించారు. అయితే అత్యధికులు పోలాండ్కు వైపు వెళ్లారన్నారు. దాదాపు 1`,975, 449 మంది పోలాండ్ వైపు వెళ్లారని పేర్కొన్నారు. ఇక.. రుమేనియా వైపు దాదాపు 5 లక్షల మంది వలస వెళ్లారని ఆయన తెలిపారు.