న్యూయార్క్: అమెరికాలో మంచు తుఫాను బీభత్సం సృష్టిస్తున్నది. న్యూయార్క్, బోస్టన్, ఫిలడెల్ఫియాలో ఎక్కడ చూసినా మంచు గుట్టలు గుట్టలుగా పేరుకుపోయింది. రహదారులపై భారీగా మంచు జమవడంతో రవాణా వ్యవస్థ స్తంభించి పోయింది. ప్రజలు ఇండ్లలోనుంచి బయటకు రావద్దని ప్రభుత్వం హెచ్చరించింది.
మంచు తుఫాను దాటికి విద్యాస్థంలు, ప్రభుత్వ కార్యాలను ఇప్పటికే మూసివేశారు. అదేవిధంగా దేశవ్యాప్తంగా నాలుగు వేలకుపైగా విమాన సర్వీసులను అధికారులు రద్దుచేశారు. హిమపాతం ఇంకా పెరిగే అవకాశం ఉందని అమెరికా వాతావరణ విభాగం వెల్లడించింది. దీంతో చాలా రాష్ట్రాలు అత్యవసర పరిస్థితిని ప్రకటించాయి.
రోజంతా మంచు కురుస్తుండటంతో తీరప్రాంతాల్లో 30 సెంటీమీటర్లకుపైగా మంచు పేరుకుపోయింది. మాన్హాటన్కు సమీంలో ఉన్న లాంగ్ ఐలాండ్లో పది అంగుళాల (25 సెంటీమీటర్లు) మేర మంచు పేరుకుపోయిందని అధికారులు వెల్లడించారు.
దీంతో రైలు పట్టాలపై మంచు ఉండటంతో రైళ్లను ఎక్కడికక్కడ నిలిపివేశామని చెప్పారు. తుఫాను బీభత్సానికి విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో మసాచుసెట్స్లో దాదాపు 1.17 లక్షల ఇండ్లు అంధకారంలో ఉన్నాయి.
తుఫాను కారణంగా న్యూయార్క్ సిటీలో రోడ్లన్నీ మంచుతో కప్పివేయబడ్డాయి. భారీగా మంచు కురుస్తుండంతో ప్రజలెవరు ఇండ్ల నుంచి బయటకు రాకూడదని, ప్రయాణాలకు దూరంగా ఉండాలని న్యూయార్క్ మేయర్ ఎరిక్ ఆడమ్స్ సూచించారు. ఎట్టిపరిస్థితుల్లో చెట్ల కింద నిలబడకూడదని, అవి ఏక్షణ్ణాయినా కూలిపోయే అవకాశం ఉందని హెచ్చరించారు.