పాకిస్తాన్ మాజీ సీఎం ఇమ్రాన్ ఖాన్తో సహా మరో 150 మందిపై కేసులు నమోదయ్యాయి. సౌబీ అరేబియాలో పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్కు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో వీరిపై కేసులు నమోదయ్యాయి. ఈ విషయాన్ని పాక్ అధికారులు వెల్లడించారు.
పాక్ ప్రధాని షహబాజ్నుద్దేశించి కొందరు దొంగ.. దొంగ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోల ఆధారంగా పంజాబ్ పోలీసులు కేసులు పెట్టారు. ఇక మాజీ మంత్రులు ఫవాద్ చౌదరి, షేక్ రషీద్, షహబాజ్ గుల్తో సహా పలువురు ప్రముఖులు కూడా వున్నారు.
పాకిస్తాన్ శిక్షా స్మృతిలోని సెక్షన్ 295ఏ కింద ఇమ్రాన్తో సహా 150 మందిపై పంజాబ్ పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇక పాక్ మీడియా ప్రకారం పాక్లోని కొందరు యాత్రికులు కూడా ప్రధాని షరీఫ్పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆ ఐదుగురిపై కూడా కేసులు నమోదయ్యాయి. అయితే తానెవ్వరినీ నినాదాలు చేయమని చెప్పలేదని మాజీ ప్రధాని ఇమ్రాన్ స్పష్టం చేశారు.