ఒట్టావో: భారత్కు చెందిన సిక్కు మతస్థుడిని కెనడా(Canada)లో హత్య చేశారు. వ్యవస్థీకృత నేరాల్లో పేరుగాంచిన ఓ గ్యాంగ్ ఆ వ్యక్తిని అటాక్ చేసి చంపినట్లు తెలుస్తోంది. దాడిలో ఆ సిక్కు వ్యక్తికి చెందిన 11 ఏళ్ల కుమారుడు కూడా హతమయ్యాడు. ఎడ్మంటన్ పట్టణంలో జరిగిన గ్యాంగ్ హింసలో ఆ ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు.
41 ఏళ్ల హర్ప్రీత్ సింగ్ ఉప్పల్, అతని కుమారుడిని ఓ గ్యాస్ స్టేషన్ సమీపంలో కాల్చి చంపారు. హర్ప్రీత్ కుమారుడికి చెందిన ఫ్రెండ్ ఆ అటాక్లో తప్పించుకున్నాడు. హర్ప్రీత్ కారులో ఉన్న ఆ పిల్లవాడికి ఏమీకాలేదు. గ్యాంగ్ వార్లో చనిపోయిన కుర్రాడి పేరును పోలీసులు వెల్లడించలేదు. ఇప్పటి వరకు ఈ కేసులో ఎవర్నీ అరెస్టు చేయలేదు. ఎవర్నీ అనుమానించలేదు.