Pakistan | ఇస్లామాబాద్: పాకిస్థాన్లో రాజకీయ అనిశ్చితికి ఎట్టకేలకు తెరపడింది. సంకీ ర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు పీపీపీ, పీఎంఎల్-ఎన్ ఒప్పందం కుదుర్చుకున్నాయి. సంయుక్త మీడియా సమావేశంలో పీపీ పీ చైర్మన్ బిలావల్ భుట్టో-జర్దారీ మా ట్లాడుతూ, పీఎంఎల్-ఎన్ అధ్యక్షుడు షెహబాజ్ షరీఫ్ (72) మళ్లీ ప్రధాని పదవిని చేపడతారని చెప్పారు. పీపీపీ కో-చైర్మన్ అసిఫ్ అలీ జర్దారీ (68) దేశాధ్యక్ష పదవికి జరిగే ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తారని తెలిపారు.