కునా, ఫిబ్రవరి 29: యాభై ఏండ్లకు పైగా జైలు శిక్ష అనుభవిస్తున్న జీవిత ఖైదీకి ప్రాణాంతక సూది మందు ఇచ్చి చంపడంలో వైద్య సిబ్బంది విఫలమయ్యారు. శరీరంలో చెడు రక్త ప్రవాహం జరిగే సిరకు సంబంధించిన నరాన్ని కనిపెట్టలేకపోవడమే ఇందుకు కారణం. ఈ కారణంగా అతడి మరణ శిక్షను అమెరికాలోని ఇడాహో రాష్ట్రం తాత్కాలికంగా నిలిపేసింది. మీడియా కథనం ప్రకారం.. క్రీచ్(73) అయిదుగురిని హత్య చేసిన కేసులో దోషి.
బుధవారం భారీ భద్రత మధ్య మూడు వైద్య బృందాలు ఎనిమిదిసార్లు ప్రాణాంతక ఇంజెక్షన్ ఇవ్వడానికి అతడి శరీరంలోని వివిధ భాగాలను పరిశీలించారు. సూది మందు ఇవ్వడానికి సరైన నరం దొరక్క చేతులెత్తేశారు. అయితే దోషికి మరణ శిక్ష అమలు చేయడానికి వేరే పద్ధతులను ప్రయత్నిస్తామని సంబంధిత అధికారులు తెలిపారు. దీనిపై క్రీచ్ న్యాయవాది కోర్టును ఆశ్రయించారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం డెత్ వారెంట్ సమయం పూర్తయ్యేలోపు మరణ శిక్ష అమలుకు మరో పద్ధతి అమలు చేయకూడదని స్టే ఇచ్చింది. మరణ శిక్ష అమలుకు మరో వారెంట్ తెచ్చుకోవాలని చెప్పింది.