త్వరలోనే కొత్త ఫీచర్ అందుబాటులోకి
శాన్ఫ్రాన్సిస్కో, మే 17: నచ్చని వాట్సాప్ గ్రూప్ల నుంచి వెళ్లిపోవాలనుకుంటున్నారా? అలా వెళ్లిపోతే గ్రూప్లోని అందరు సభ్యులకు తెలిసిపోతుంది కదా.. ఎలా అని సంకోచిస్తున్నారా? అయితే మీలాంటి వారి కోసమే వాట్సాప్ కొత్త ఫీచర్ను త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నది. మీరు గ్రూప్ నుంచి నిష్క్రమించినా సరే గ్రూప్లో సభ్యులెవరికీ ఆ నోటిఫికేషన్ వెళ్లకుండా కొత్త ఫీచర్ను రూపొందిస్తున్నది. కేవలం గ్రూప్ అడ్మిన్కు మాత్రమే మీరు వెళ్లిపోయినట్టు తెలుస్తుంది.
అంటే ఇకపై ఏ గ్రూప్ నుంచి అయినా సైలెంట్గా వెళ్లిపోవచ్చన్న మాట. అయితే ప్రస్తుతం ఈ ఫీచర్ వాట్సాప్ డెస్క్టాప్ వెర్షన్లో అభివృద్ధి చేస్తున్నామని, ఆ తర్వాత ఆండ్రాయిడ్, ఐవోఎస్ ఫోన్లలో కూడా అందుబాటులోకి తీసుకొస్తామని సంస్థ తెలిపింది. కాగా, ఇప్పటివరకు ఒక గ్రూప్లో గరిష్టంగా 256 మందిని మాత్రమే యాడ్ చేసే వీలుండగా, త్వరలో 512 మందిని యాడ్ చేసేలా వెసులుబాటు కల్పించనున్నది.