న్యూయార్క్: గాలిలోని కార్బన్ డయాక్సైడ్ను పీల్చి సముద్రంలో భద్రంగా దాచే అధునాతన విధానాన్ని శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. అమెరికాలోని లేహై యూనివర్సిటీ ప్రొఫెసర్ ఆరుప్సేన్ గుప్తా ఆధ్వర్యంలోని బృందం ఈ విధానం రూపొందించింది.
ఒక టన్ను కార్బన్ డయాక్సైడ్ను పీల్చి, దాచేందుకు రూ.8 వేల కంటే తక్కువే అవుతుందని ఆయన వెల్లడించారు. భూతాపాన్ని తగ్గించేందుకు ఉత్తమ మార్గం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.