వాషింగ్టన్ ,మే 5: డిస్పోజబుల్ ఫేస్ మాస్క్ల్లో ప్రమాదకర కారకాలున్నట్లు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ ఫేస్ మాస్క్లను నీటిలో ముంచినప్పుడు విడుదలయ్యే ప్రమాదకరమైన రసాయన కాలుష్య కారకాలున్నట్లు స్వాన్సీయా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు కనుగొన్నారు.డిస్పోజబుల్ ఫేస్ మాస్క్లు తయారీకి సిలికాన్ , ప్లాస్టిక్ ఫైబర్లలో సీసం, యాంటిమోనీ ,రాగితో సహా అధిక స్థాయిలో కాలుష్య కారకాలనువినియోగిస్తున్నట్లు పరిశోధనలో వెల్లడైంది.
ఇన్స్టిట్యూట్ ఫర్ ఇన్నోవేటివ్ మెటీరియల్స్, ప్రాసెసింగ్ అండ్ న్యూమరికల్ టెక్నాలజీస్ (ఇంపాక్ట్) ,స్పెసిఫిక్ ఇన్నోవేషన్ అండ్ నాలెడ్జ్ సెంటర్ల సహకారం తో ఈ ప్రాజెక్ట్ చేపట్టారు. స్వాన్సీయా యూనివర్శిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కు చెందిన డాక్టర్ సర్పర్ సర్ప్ ఈ ప్రాజెక్ట్ కు బాధ్యతవహించారు. “మనమందరంమాస్కులు ధరించడం అవసరం. మహమ్మారిని అంతం చేయడంలో చాలా అవసరం. కాని మాస్కు ఉత్పత్తిపై మరింత పరిశోధన ,నియంత్రణ అవసరం, కాబట్టి పర్యావరణానికి , మానవ ఆరోగ్యానికి ఏవైనా ప్రమాదాలను తగ్గించవచ్చనే ఆలోచనతో పరిశోధన చేసాం ” పరిశోధన బృందం నిర్వహించిన పరీక్షల్లో వివిధ రకాలమాస్కులను ఉపయోగించారు. కరోనామహమ్మారి కారణంగా సింగిల్-యూజ్ మాస్క్ల పెరుగుదల, వ్యర్థాలు కాలుష్యానికి కొత్త కారణమని తేలినట్లు డాక్టర్ సర్పర్ సర్ప్ తెలిపారు.