Pakistan | లాహోర్: పాకిస్థాన్లోని పంజాబ్ ప్రావిన్స్ మంత్రిగా సర్దార్ రమేశ్ సింగ్ అరోరా బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో దేశ విభజన తర్వాత పాక్లో ఈ పదవిని చేపట్టిన తొలి సిక్కు నేతగా నిలిచారు.
ఆ దేశంలోని మైనారిటీల్లో ఆయన పలుకుబడిగలవారు. ఆయన మాజీ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని పీఎంఎల్-ఎన్ పార్టీకి చెందినవారు.