యాపిల్ కంపెనీ సహ వ్యవస్థాపకుడు, దివంగడ స్టీవ్ జాబ్స్ పాత చెప్పులు వేలంలో అత్యధిక ధరకు అమ్ముడుపోయాయి. అమెరికాలో జూలియెన్స్ అనే కంపెనీ ఆదివారం నిర్వహించిన వేలంలో స్టీవ్ జాబ్స్ బిర్కెన్స్టాక్ కంపెనీ సాండల్స్ 2,20,000 వేల డాలర్లు (మన కరెన్సీలో రూ.1.78 కోట్లు) పలికాయి. గోధుమ రంగులో ఉన్న ఈ సాండల్స్ను 1970ల్లో స్టీవ్ జాబ్స్ ఉపయోగించాడు. వీటి మీద స్టీవ్ కాలి ముద్రలు ఉన్నాయి. అందుకని ఈ చెప్పుల్ని ఒకాయన కోటి డెబ్భయి లక్షలకు వేలంలో సొంతం చేసుకున్నాడు.
వేలంలో స్టీవ్ జాబ్స్ పాత సాండల్స్కి 60 వేల డాలర్ల ధర వస్తుందని అనుకున్నారు. ఈ సాండల్స్కి నాన్ ఫంజిబుల్ టోకెన్ ధర 2,18.750 డాలర్లుగా నిర్ణయించారు. అయితే, రికార్డు స్థాయిలో రెండు లక్షల ఇరవై వేల డాలర్లు వచ్చాయి. జూలియెన్స్ కంపెనీ ఈ సాండల్స్ని కొనుగోలు చేసిన వ్యక్తి వివరాలు మాత్రం వెల్లడించలేదు.
స్టీవ్ జాబ్స్, స్టీవ్ వోజ్నియాక్ కలిసి కాలిఫోర్నియాలో 1976లో యాపిల్ కంపెనీని ప్రారంభించారు. స్టీవ్జాబ్స్ 2011లో క్లోమగ్రంథి క్యాన్సర్తో చనిపోయాడు. ప్రస్తుతం టిమ్ కుక్ యాపిల్ సీఈవోగా ఉన్నాడు.