మాస్కో, సెప్టెంబర్ 24: రష్యాలో అధ్యక్షుడు పుతిన్కు వ్యతిరేకంగా ఆందోళనలు ఊపందుకొన్నాయి. ఉక్రెయిన్తో యుద్ధానికి దాదాపు 3 లక్షల మంది పాక్షిక బలగాలను సేకరిస్తామని ఆయన చేసిన ప్రకటనపై రష్యన్లలో తీవ్ర నిరసన వ్యక్తమవుతున్నది. పుతిన్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రష్యాలోని పలు నగరాల్లో ప్రజలు పెద్ద ఎత్తున శాంతియుత ఆందోళనలకు దిగారు. ఆందోళనల అణచివేతకు పుతిన్ పోలీసులను రంగంలోకి దించి 750 మందిని అరెస్టు చేశారు. రాజధాని మాస్కోలో 370 మంది, సెయింట్ పీటర్స్బర్గ్లో 150 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని స్థానిక మీడియా పేర్కొన్నది. అరెస్టయిన వారిలో మైనర్లు కూడా ఉన్నారని ఓవీడీ-ఇన్ఫో వెబ్సైట్ తెలిపింది.
సోవియట్ నాటి యుద్ధ ట్యాంకులతో బరిలోకి రష్యా
ఉక్రెయిన్-రష్యా యుద్ధం కొనసాగుతున్న వేళ సోవియట్ కాలం నాటి పలు యుద్ధ ట్యాంకులను గూడ్స్ రైళ్లలో ద్వారా తరలిస్తున్న వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీన్ని ఉక్రెయిన్ అంతర్గత వ్యవహారాల శాఖ సలహాదారు ఆంటోన్ గెరాష్చెంకో ట్విట్టర్లో షేర్ చేశారు. రష్యాకు చెందిన దాదాపు 2 వేలకు పైగా యుద్ధ ట్యాంకులకు తాము ధ్వంసం చేశామని, దీంతో తన పాత టీ-62 ట్యాంకులను స్టోరేజీ నుంచి బయటకు తీస్తున్నదని పేర్కొన్నారు.