కీవ్, మే 26: ఉక్రెయిన్ ఆక్రమణపై రష్యాకు మద్దతుగా నిలిస్తున్న చెచెన్ నేత రంజాన్ కదిరోవ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ‘ఉక్రెయిన్ సమస్య ముగిసింది. తర్వాత పోలాండ్ పట్ల ఆసక్తిగా ఉన్నది’ అని ఆయన ఓ వీడియోలో మాట్లాడారు. ‘ఉక్రెయిన్ అనంతరం.. ఒకవేళ మాకు ఆదేశాలు వస్తే.. ఆరు సెకండ్లలో ఏం చేయగలమో చేసి చూపుతాం’ అంటూ పోలాండ్ను హెచ్చరించారు. ఉక్రెయిన్కు సరఫరా చేస్తున్న ఆయుధాలను వెనక్కి తీసుకోవాలని ఆ దేశాన్ని బెదిరించారు. ‘విక్టరీ డే’ సందర్భంగా పోలాండ్లో రష్యా రాయబారిపై ఎరుపు సిరా దాడిని ఖండించారు. దీనిపై పోలాండ్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మరోవైపు, ఉక్రెయిన్పై యుద్ధంలో పుతిన్ను గెలువనీయబోమని జర్మన్ చాన్స్లర్ ఓలఫ్ స్కోల్ట్ గురువారం పేర్కొన్నారు.