కైవ్: చెర్నోబిల్ అణు కేంద్రం స్వాధీనానికి రష్యా దళాలు ప్రయత్నిస్తున్నాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమీర్ జెలెన్స్కీ తెలిపారు. 1986 నాటి విషాదం పునరావృతం కాకుండా ఉండటానికి తమ సైనికులు పోరాడుతున్నారని, ప్రాణాలను అర్పిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని స్విడన్ ప్రధానికి నివేదించినట్లు వెల్లడించారు. కాగా ఇది మొత్తం యూరప్పై యుద్ధం వంటిదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
మరోవైపు ఉక్రెయిన్లో 70 సైనిక లక్ష్యాలు, 11 ఎయిర్బేస్లను నాశనం చేసినట్లు రష్యా ప్రకటించింది. అయితే రాజధాని కైవ్లోని ఎయిర్ బేస్ సమీపంలో రష్యా దళాలతో పోరాడుతున్నట్లు ఉక్రెయిన్ ఆర్మీ తెలిపింది.