డోన్బాస్లో తాము నిర్వహిస్తున్న ప్రత్యేక మిలటరీ ఆపరేషన్ ప్రజలను కాపాడేందుకే అని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ ప్రకటించారు. ఉక్రెయిన్పై దాడి చేస్తున్నందుకు నిరసగా యూఎన్ జనరల్ అసెంబ్లీలో కొన్ని దేశాలు తమకు వ్యతిరేకంగా ఓటు వేశాయని, అవి తీవ్ర ఒత్తిళ్ల మేరకు అలా ఓటు వేశాయని ఆయన అన్నారు. ఇక.. ఉక్రెయిన్కు ఆయుధాలు తీసుకొచ్చే ట్రాన్స్పోర్టు వాహనాలన్నింటినీ
మిలటరీ టార్గెట్లుగా ప్రకటిస్తామని రష్యా విదేశాంగ మంతరి లావరోవ్ హెచ్చరించారు.
ఉక్రెయిన్ శాంతి చర్చలను నిలిపివేస్తోందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ శుక్రవారం ఆరోపించారు. యుద్ధాన్ని ముగించేందుకు అవసరమైన పరిష్కారాల అన్వేషణకు రష్యా సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు ఉక్రెయిన్పై రష్యా దాడులు నిరాటంకంగా సాగుతున్నాయి. పలు నగరాలు, పట్టణాలపై రష్యా బలగాలు కాల్పులతో విరుచుకుపడుతున్నాయి.