కొలంబో: శ్రీలంక ప్రధాని రాణిల్ విక్రమసింఘే ఇవాళ ఆ దేశ తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. అధ్యక్షుడు గోటబాయ రాజపక్స దేశాన్ని విడిచి సింగపూర్కు పరారీ అయిన విషయం తెలిసిందే. అయితే కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునే వరకు ప్రధాని విక్రమసింఘేనే తాత్కాలిక అధ్యక్ష బాధ్యతల్ని నిర్వర్తించనున్నారు. దేశంలో తీవ్ర ఆర్థిక సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో ప్రభుత్వ తీరును ఖండిస్తూ లంక ప్రజలు భారీ ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. చీఫ్ జస్టిస్ జయంత్ జయసూర్య సమక్షంలో ఇవాళ విక్రమసింఘే తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రమాణం చేశారు. రాజపక్స అధికారికంగా అధ్యక్ష పదవికి రాజీనామా చేసినట్లు పార్లమెంట్ స్పీకర్ మహింద యాపా అబయవర్దనే తెలిపారు.
#WATCH | Ranil Wickremesinghe sworn in as Acting-President a short while ago by Sri Lankan Chief Justice Jayantha Jayasuriya#SriLanka pic.twitter.com/odjNmfd4cf
— ANI (@ANI) July 15, 2022