ఖాట్మండు: నేపాల్ నూతన అధ్యక్షుడిగా నేపాలీ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రామ్ చంద్ర పౌడెల్ ప్రమాణస్వీకారం చేశారు. నేపాల్ యాక్టింగ్ చీఫ్ జస్టిస్ హరికృష్ణ కర్కి ఇవాళ 78 ఏండ్ల పౌడెల్ చేత ప్రమాణస్వీకారం చేయించారు. నేపాల్ అధ్యక్ష కార్యాలయంలోని శీతల్ నివాస్లో ఈ ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది.
నేపాల్ మాజీ అధ్యక్షురాలు విద్యాదేవి భండారీ పదవీకాలం ఈ నెల 12తో ముగిసింది. ఈ నేపథ్యంలో గత గురువారమే నూతన అధ్యక్షుడిగా రామ్చంద్ర పౌడెల్ను ఎన్నుకున్నారు. అధ్యక్ష ఎన్నికల్లో మొత్తం 313 మంది ఫెడరల్ పార్లమెంట్ సభ్యులు, 518 మంది ప్రావిన్షియల్ అసెంబ్లీ సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
అందులో 214 మంది పార్లమెంట్ సభ్యులు, 352 మంది ప్రావిన్షియల్ అసెంబ్లీ సభ్యులు రామ్చంద్ర పౌడెల్కు మద్దతుగా ఓటువేశారు. అంటే మొత్తం ఎలక్టోరల్ ఓట్లలో 33,802 ఓట్లు రామ్చంద్ర పౌడెల్కు లభించగా.. మిగతా 15,518 ఓట్లు ఆయన ప్రత్యర్థి సుభాష్ చంద్ర నెంబాంగ్కు దక్కాయి. దాంతో పౌడెల్ గెలిచినట్లుగా నేపాల్ ఎన్నికల సంఘం ప్రకటించింది.