కొలంబో: శ్రీలంక రాజధాని కొలంబో వీధుల్లో ఆర్మీ గస్తీ నిర్వహిస్తోంది. అధక్ష్య, ప్రధాని భవనాల నుంచి వెళ్లనున్నట్లు నిరసనకారులు ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ మరోవైపు ఆందోళనలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో లంక ఆర్మీ కొలంబో వీధుల్లో పెట్రోలింగ్ నిర్వహిస్తోంది. ఇక రెండు రోజుల క్రితం దేశం విడిచి మాల్దీవులకు పరారీ అయిన అధ్యక్షుడు గొటబాయ రాజపక్స ఇవాళ సింగపూర్కు వెళ్లారు. సౌదీ ఎయిర్లైన్స్కు చెందిన ఎస్వీ788 విమానంలో ఆయన మాలే నుంచి సింగపూర్కు బయలుదేరి వెళ్లారు. అయితే అక్కడ నుంచి జెడ్డాకు వెళ్లనున్నట్లు వస్తున్న వార్తలను ఖండించారు. రాజపక్స తన భార్యతో కలిసి సింగపూర్లోనే ఉంటారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
#WATCH | Sri Lanka: Military armoured vehicles seen on the roads of Colombo as massive protests continue to simmer in the island-nation#SriLankaCrisis pic.twitter.com/ihFvTo20rG
— ANI (@ANI) July 14, 2022