న్యూఢిల్లీ : ఉక్రెయిన్లో చిక్కుకున్న వారిని స్వదేశానికి రప్పించే ప్రణాళికలను కేంద్ర ప్రభుత్వం తక్షణమే వెల్లడించాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కోరారు. ఉక్రెయిన్లో చిక్కుకున్న కొందరు విద్యార్ధులను అక్కడి సైన్యం వేధింపులకు గురిచేస్తున్న వీడియోను రాహుల్ గాంధీ షేర్ చేశారు.
భారత విద్యార్ధులు ఉక్రెయిన్లో హింసాకాండతో ఇబ్బందులు పడుతున్నారని ఇలాంటి వీడియోలను వారి కుటుంబ సభ్యులు చూడాల్సి రావడం బాధాకరమని ఆ వీడియోను షేర్ చేస్తూ రాహుల్ గాంధీ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఉక్రెయిన్లో చిక్కుకున్న వారిని అక్కడి నుంచి ఖాళీ చేయించే సమగ్ర ప్రణాళికను కేంద్ర ప్రభుత్వం తక్షణమే వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు.
మన సొంత మనుషులను మనం వదిలివేయలేమని అన్నారు. ఉక్రెయిన్ నుంచి సకాలంలో భారత విద్యార్ధులను ప్రభుత్వం ఖాళీ చేయించడం లేదని రాహుల్తో పాటు కాంగ్రెస్ పార్టీ మోదీ సర్కార్పై విమర్శలు గుప్పిస్తోంది. రష్యా దాడులతో భీతిల్లిన ఉక్రెయిన్లో భారత విద్యార్ధుల దుస్థితిని తెలిపే పలు వీడియోనలు కాంగ్రెస్ నేతలు షేర్ చూస్తూ వారిని త్వరగా ఆ దేశం నుంచి ఖాళీ చేయించాలని బార ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.