పెర్త్: అత్యంత ప్రమాదకరమైన అణు ధార్మికతను రిలీజ్ చేసే క్యాప్సూల్ను ఆస్ట్రేలియా అధికారులు గుర్తించారు. వారం రోజుల క్రితం వెస్ట్రన్ ఆస్ట్రేలియాలో ఆ గుళిక ఓ ట్రక్కు నుంచి మిస్సైంది. రియో టింటో మైనింగ్ క్షేత్రం నుంచి ట్రాన్స్పోర్ట్ చేస్తున్న సమయంలో చిన్నపాటి క్యాప్సూల్ ట్రాన్స్పోర్ట్లో కనిపించకుండాపోయింది. దీంతో ఆస్ట్రేలియాలో తీవ్ర కలవరం మొదలైంది. ఒకవేళ ఆ గుళిక ఓపెన్ అయి ఉంటే… దాని వల్ల పెను ప్రమాదం జరిగేదని అధికారులు అంచనా వేశారు.
6ఎంఎం చుట్టుకొలత.. 8ఎంఎం పొడుగు ఉన్న ఆ క్యాప్సూల్ లో సీసియం-137 రేడియోయాక్టివ్ పదార్ధం ఉంది. ఆ రేడియోయాక్టివ్ పదార్థం వల్ల చర్మం డ్యామేజ్ కావడం, మండిపోవడం, రేడియేషన్ రుగ్మతలు కలిగే అవకాశాలు ఉన్నాయి. రేడియేషన్ డిటెక్టార్ల ద్వారా ఆ గుళికను గుర్తించినట్లు ఎమర్జెన్సీ సర్వీసు పేర్కొన్నది. రోడ్డుకు రెండు మీటర్ల దూరంలో ఆ క్యాపూల్స్ ఉన్నట్లు పసికట్టారు.
ఒకవేళ సీసియం క్యాప్సూల్కు ఎక్స్పోజ్ అయితే.. అది గంటలో 10 ఎక్సరేలకు సమానమైన రేడియేషన్ విడుదల చేస్తుందని హెల్త్ ఆఫీసర్ ఆండ్రూ రాబర్ట్సన్ తెలిపారు. ట్రక్కులో తీసుకువెళ్తున్న సమయంలో.. ఆ ట్రక్కు బోట్లు ఊడిపోవడం వల్ల.. క్యాప్సూల్ ఉన్న పరికరం కింద పడినట్లు భావిస్తున్నారు.