గ్రహాంతరవాసుల ఉనికి కోసం రేడియో సిగ్నల్
వాషింగ్టన్, ఏప్రిల్ 19: గ్రహాంతర వాసుల (ఏలియన్స్) ఉనికి ఇప్పటికీ మిలియన్ డాలర్ ప్రశ్నే. వారి జాడ గురించి తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు చేయని ప్రయోగాలు లేవు. అయినప్పటికీ, వారి ఉనికికి సంబంధించిన ఏ ఒక్క ఆధారం కూడా ఇంకా లభించలేదు. దీంతో విశ్వాంతరాళంలోకి ఓ శక్తిమంతమైన రేడియో సిగ్నల్ను పంపించాలని శాస్త్రవేత్తలు తాజాగా నిర్ణయించారు.
ఆ సందేశంలో మనుషుల డీఎన్ఏ సమాచారాన్ని క్రోడీకరించనున్నారు. ఒకవేళ, ఆ మెసేజ్కు ఎవరైనా స్పందిస్తే, గ్రహాంతరవాసుల ఉనికిపై శాస్త్రీయంగా నిర్ధారణకు రావొచ్చన్నది శాస్త్రవేత్తల భావన. కాగా 1974 నవంబర్లో కూడా ఇదే తరహా రేడియో సిగ్నల్ను శాస్త్రవేత్తలు పంపించారు. ఇంకా ప్రయాణిస్తున్న ఆ సిగ్నల్కు ఇప్పటివరకూ ఎవరూ స్పందించలేదు.
తాజా సిగ్నల్లో ఏమేమి పంపించనున్నారు?