మాస్కో: నకిలీ వార్తలను ప్రచారం చేస్తున్నవారిని కట్టడి చేసేందుకు రష్యా కొత్త చట్టాన్ని తయారు చేసింది. ఆమోదం పొందిన ఆ చట్టంపై అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సంతకం చేశారు. అధికారుల గురించి ఫేక్ న్యూస్ను ప్రచారం చేస్తున్న వారికి కొత్త చట్టం ప్రకారం 15 ఏళ్ల జైలు శిక్ష విధించనున్నారు. ఉక్రెయిన్పై దాడికి వెళ్లిన రష్యా గత నెలలోనూ ఓ చట్టాన్ని రూపొందించింది. సైనిక దళాలపై తప్పుడు ప్రచారం చేసే వారికి కూడా జైలు శిక్ష విధించనున్నారు. రష్యా ఎంబసీలు, విదేశీ సంస్థలపై అబద్ద ప్రచారాన్ని ఆపేందుకు ఈ కొత్త చట్టాన్ని తీసుకువచ్చినట్లు ఆ దేశ సీనియర్ నేత ఒకరు తెలిపారు.