హేగ్: యుద్ధ నేరారోపణల కింద రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ను శిక్షించాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ(Zelensky) తెలిపారు. హేగ్లోని అంతర్జాతీయ క్రిమినల్ కోర్టులో ఆయన ఇవాళ మాట్లాడారు. రష్యా యుద్ధ నేరాలకు పాల్పడుతోందని, ఆ కేసుల్ని పరిష్కరించేందుకు వార్ ట్రిబ్యునల్ను ఏర్పాటు చేయాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కోరారు. దూకుడుతత్వంతో నిర్వహించే యుద్ధాలను ఆపలేమని, కానీ క్రిమినల్ ఐడియాతో సాగిస్తున్న యుద్ధాన్ని ఆపవచ్చు అని ఆయన అన్నారు. ఆయుధ బలగాలతోనే యుద్ధాన్ని గెలవగలమని,ఉక్రెయిన్కు ఆయుధాలను సరఫరా చేసిన నెదర్లాండ్స్కు ఆయన థ్యాంక్స్ తెలిపారు.
పుతిన్ను చంపేందుకు ఉక్రెయిన్ ప్రయత్నించినట్లు రష్యా ఆరోపిస్తోంది. రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్పై తాజాగా డ్రోన్ అటాక్ జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడి వెనుక అమెరికా హస్తం ఉందని రష్యా ఆరోపిస్తోంది. మరో వైపు ఆ అటాక్ను ఉక్రెయిన్ ఖండించింది. స్వేచ్ఛ, న్యాయం, శాంతిని గౌరవించాలని జెలెన్స్కీ అన్నారు. ఒక్క ఏప్రిల్ నెలలోనే 6139 యుద్ధ నేరాలకు రష్యా పాల్పడినట్లు ఉక్రెయిన్ ఆరోపిస్తోంది. ఆ నేరాల వల్ల 207 మంది ఉక్రెయిన్ పౌరులు మృతిచెందినట్లు జెలెన్స్కీ తెలిపారు.