టెహ్రాన్: ఇరాన్లో హిజాబ్కు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతున్నాయి. తాజాగా ఇస్లామిక్ రిపబ్లిక్ వ్యవస్థాపకుడు అయతుల్లా రుహోల్లా ఖొమేని జన్మించిన పూర్వీకుల ఇంటికి నిరసనకారులు నిప్పుపెట్టారు. ఖొమేని నగరంలో శుక్రవారం ఈ సంఘటన జరిగింది. రెండు నెలల కిందట బహిరంగ ప్రాంతంలో హిజాబ్ ధరించనందుకు 22 ఏళ్ల మహసా అమిని అనే యువతిని ఆ దేశ నైతిక పోలీసులు అరెస్ట్ చేశారు. వారి చిత్రహింసలు భరించలేని ఆ యువతి కోమాలోకి వెళ్లి మరణించింది. ఈ సంఘటనపై ఇరాన్లోని ముస్లిం మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కఠినమైన మతాధికారుల పాలనకు వ్యతిరేకంగా గళమెత్తుతున్నారు. నాటి నుంచి ఆ దేశంలో నిరసనలు కొనసాగుతున్నాయి.
కాగా, గురువారం నాటి అల్లర్లలో ఐదుగురు భద్రతా సిబ్బంది మరణించినట్లు ఇరాన్ అధికార మీడియా పేర్కొంది. అయితే భద్రతా సిబ్బంది కాల్పుల్లో చనిపోయిన పలువురు ఇరాన్ యువకుల మృతదేహాలకు శుక్రవారం అంత్యక్రియలు నిర్వహించినట్లు వార్తలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో ఆ దేశంలో మరోసారి నిరసనలు వెల్లువెత్తాయి. 30 ఏళ్లుగా మ్యూజియంగా ఉన్న ఇస్లామిక్ రిపబ్లిక్ వ్యవస్థాపకుడు అయతుల్లా రుహోల్లా ఖొమేని జన్మించిన పూర్వీకుల ఇంటికి ఆందోళనకారులు నిప్పుపెట్టారు. ఈ వీడియో క్లిప్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Protesters have burned down the house in which Ruhollah Khomeini, the founder of #Iran's Islamist regime, was born in.
The house, in the city of Khomein, has been a museum for the past 30 years. Now it's charcoal.
The protests are increasing in strength…#mahsaami̇ni̇ pic.twitter.com/WBMB8NczTs
— Stepan Gronk (@StepanGronk) November 19, 2022