టైటిల్ చదవగానే అలా ఎలా సాధ్యమైంది అని ఆలోచిస్తున్నారా? అవును.. భర్త జైలులో ఉన్నాడు. భార్య మాత్రం ఇంటి దగ్గర నలుగురు పిల్లలకు జన్మనచ్చింది. అలా ఎలా సాధ్యమైంది అని మరోసారి డౌట్ వచ్చింది కదా. కానీ.. తను ఎలాంటి తప్పు చేయకుండా.. అక్రమ సంబంధం పెట్టుకోకుండా.. తన భర్త ద్వారానే నలుగురు పిల్లలకు జన్మనిచ్చింది. ఈ ఘటన పాలస్తీనాలో చోటు చేసుకుంది.
పాలస్తీనాకు చెందిన రఫట్ అల్ క్వరావీ అనే టెర్రరిస్టు గత 15 సంవత్సరాల నుంచి జైలులో ఉంటున్నాడు. ఇటీవల ఓ టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాను జైలులో ఉండి నలుగురు పిల్లలను కన్నానని రఫట్ చెప్పడంతో పాలస్తీనీయులు అందరూ షాక్ అయ్యారు.
అలా ఎలా తండ్రివయ్యావు అని రఫట్ను ఇంటర్వ్యూయర్ అడగడంతో అప్పుడు అసలు విషయం చెప్పాడు రఫట్. తన భార్య జైలుకు వచ్చినప్పుడల్లా తన వీర్యాన్ని చిప్స్ ప్యాకెట్లో నింపి.. దాన్ని ప్యాక్ చేసి తనకు ఇచ్చేవాడినని.. అలా తన వీర్యంతో అతడి భార్య నలుగురు పిల్లలను కన్నదని చెప్పుకొచ్చాడు. తన వీర్యాన్ని తీసుకెళ్లి ఫెర్టిలిటీ క్లీనిక్లో డాక్టర్ల సలహాతో ఆ వీర్యాన్ని తన అండంతో ఫలధీకరణం చేయించుకొని నలుగురు పిల్లలకు తల్లి అయిందని చెప్పడంతో అక్కడున్న వారంతా నోరెళ్లబెట్టారు.
ఇది తాను మాత్రమే చేసింది కాదని.. చాలామంది టెర్రరిస్టులు జైలు నుంచి అలాగే తమ వీర్యాన్ని తన భార్యలకు పంపించేవారని చెప్పుకొచ్చాడు రఫట్. పాలస్తీనాకు చెందిన మీడియా కథనం ప్రకారం.. ఇప్పటి వరకు అలా 101 మంది పిల్లలు జైలు నుంచి వీర్యం పంపడం ద్వారా జన్మించినట్టు తెలుస్తోంది.
మరోవైపు ఇదంతా ఫేక్ అని.. అసలు స్పెర్మ్ను బయటికి వచ్చాక.. దాంట్లో ఉన్న వీర్యకణాలు వెంటనే చనిపోతాయని.. ఆ వీర్యం ద్వారా గర్భం దాల్చడం అసాధ్యం అని మెడికల్ ఎక్స్పర్ట్స్ కొట్టిపారేస్తున్నారు. మరి.. ఆ పిల్లలు ఎలా పుట్టినట్టు.. అనేదానికి మాత్రం ఎవ్వరి దగ్గర సమాధానం లేదు.
ఇక.. రఫట్ ఇజ్రాయెల్లో 2006లో ఉగ్రదాడుల కోసం ప్లాన్ చేశాడన్న ఆరోపణలతో అతడిని అరెస్ట్ చేసి జైలు శిక్ష విధించారు. అతడు ఆల్ అక్సా మార్టీర్స్ మెంబర్. అతడితో పాటు పలువురు టెర్రరిస్టులకు జైలు శిక్ష విధించింది అప్పటి పాలస్తీనా ప్రభుత్వం.