వాటికన్ సిటీ: ప్రజలందరూ కోవిడ్ టీకా వేయించుకోవాలని పోప్ ఫ్రాన్సిస్ ( Pope Francis ) తన సందేశంలో అభ్యర్థించారు. వ్యాక్సిన్లతో కరోనా మహమ్మారిని అంతం చేయవచ్చు అని ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరూ టీకా వేసుకుంటే.. కరోనా కనుమరుగవుతుందన్నారు. దేవుడు మనపై దయ ఉంచాడని, దానికి థ్యాంక్స్ చెబుతున్నాని, మనల్ని మనం రక్షించుకునేందుకు మనకు కోవిడ్ టీకాలు ఉన్నాయన్నారు. అమెరికాకు చెందిన యాడ్ కౌన్సిల్ అండ్ పబ్లిక్ హెల్త్ తరపున ప్రచారం నిర్వహించిన పోప్ ఫ్రాన్సిస్ ఓ వీడియో సందేశంలో ఈ విషయాలను తెలిపారు. మార్చి నెలలోనే పోప్ ఫ్రాన్సిస్ వ్యాక్సిన్ తీసుకున్నారు.