న్యూయార్క్: శుద్ధి చేసిన బియ్యం, గోధుమలు, ప్రాసెస్ చేసిన మాంసం(రెడ్ మీట్) ఎక్కువగా తీసుకోవడం ప్రపంచవ్యాప్తంగా డయాబెటిస్ (మధుమేహం) కేసులు పెరగడానికి కారణమవుతున్నదని ఒక అధ్యయనంలో తేలింది. తృణ ధాన్యాలు తక్కువగా తీసుకోవడం కూడా ఈ వ్యాధి పెరగడానికి కారణమవుతున్నది.
జర్నల్ ఆఫ్ నేచర్ మెడిసిన్లో ప్రచురితమైన ఈ అధ్యయన వివరాల ప్రకారం సమతుల ఆహార అలవాట్ల లేమి(పూర్ డైట్) కారణంగా ఇటీవల ప్రపంచవ్యాప్తంగా 1.41 కోట్ల టైప్-2 డయబెటిస్ కేసులు నమోదయ్యాయి.