లండన్ : పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్ లండన్లో తన సోదరుడు, పీఎంఎల్-ఎన్ అధినేత నవాబ్ షరీఫ్ను కలిశారు. ఇద్దరు కొత్త ఆర్మీ చీఫ్ నియామకంపై ఇరువురు చర్చించినట్లు తెలుస్తున్నది. షాబాజ్ ఈజిప్ట్లోని COP27 వాతావరణ సదస్సు నుంచి నేరుగా లండన్కు ప్రైవేట్ విమానంలో బయలుదేరి వెళ్లాడు. ప్రస్తుత పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ కమర్ జావేద్ బజ్వా ఈ నెల 29న పదవీ విరమణ చేయనున్నారు. ఈ సందర్భంగా షబాజ్ షరీఫ్ ప్రతిపక్ష పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (PTI) లాంగ్ మార్చ్ అంశంపై సైతం చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది.
పీటీఐ పార్టీ అధ్యక్షుడు ఇమ్రాన్పై దాడి నేపథ్యంలో నిలిపివేయగా.. గురువారం మళ్లీ ప్రారంభమైంది. పదవీచ్యుతుడైన మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, ప్రధాని షాబాజ్ తన నవాబ్ షరీశ్తో కలిసి అధికారిక రహస్యాల చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారని, ఆర్మీ చీఫ్ నియామకంపై తన ప్రమాణాన్ని ఉల్లంఘిస్తున్నారని డాన్ పత్రిక ఆరోపించింది. ఇదిలా ఉండగా.. నవాజ్ షరీఫ్ నవంబర్ 2019 నుంచి లండన్లో నివాసం ఉంటున్న విషయం తెలిసిందే. చికిత్స కోసం వెళ్లిన ఆయన ఇప్పటి వరకు తిరిగి రాలేదు. మూడుసార్లు పాక్ ప్రధానమంత్రిగా పనిచేసిన ఆయన.. తన హయాంలో కనీసం నలుగురు ఆర్మీ చీఫ్లను నియమించారు.